
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ దాడిలో బీ2 బాంబర్ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ బీ2 బాంబర్ విమానాల గురించి కొన్ని నమ్మలేని నిజాలు, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బీ-2 స్పిరిట్ బాంబర్ జెట్లో చాలా సౌకర్యాలే ఉన్నాయి. 37 గంటలు నాన్ స్టాప్గా వైమానిక దాడులు చేసే B-2 Bomber విమానాల్లో పైలట్ల కోసం టాయ్ లెట్, మైక్రోవేవ్ ఓవెన్, కాస్త రిలాక్స్ అవడానికి బంక్ బెడ్, స్నాక్స్ కోసం కూలర్.. ఇలా ఇది యుద్ధ విమానమా..? లేక ఫ్లైయింగ్ హోటలా అనే డౌటొచ్చేంతలా ఫెసిలిటీస్ ఈ B-2 Bomber జెట్లో ఉన్నాయి.
ఫస్ట్ టైం.. 1997లో B-2 Bomber విమానాలు సర్వీస్లోకి వచ్చాయి. ఈ యుద్ధ విమానం ఖరీదు 2 బిలియన్ డాలర్లు. అమెరికా దగ్గర ప్రస్తుతం మొత్తం 19 B-2 Bomber జెట్లు ఉన్నాయి. 20 ఉండాల్సినప్పటికీ.. 2008లో జరిగిన క్రాష్లో ఒక బాంబర్ జెట్ కూలిపోయింది. ఒక పైలట్ కాసేపు పడుకుని రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక చిన్న రూం సెటప్ ఈ బాంబర్ జెట్లో ఉండటం విశేషం. 172 అడుగుల వింగ్ స్పాన్ ఉన్న ఈ B-2 Bomber యుద్ధ విమానానికి ఇద్దరు పైలట్లు మాత్రమే ఉంటారు. ఆటోమేషన్లో కూడా ఈ బీ2 బాంబర్ విమానం నడుస్తుంది.
►ALSO READ | Iran Ceasefire: యుద్ధం ముగిసింది: లాస్ట్ రౌండ్ అంటూ ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైల్ దాడులు
ఇరాన్పై పక్కా వ్యూహంతో అమెరికా చేసిన ఈ దాడుల్లో బీ2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాలను అమెరికా వినియోగించిన సంగతి తెలిసిందే. ఇవి నాన్స్టాప్గా 37 గంటల పాటు గాల్లోనే ప్రయాణించి అనుకున్న లక్ష్యాలను ఛేదించాయి. మధ్యలో పలుమార్లు గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. అమెరికాలోని మిస్సోరి నుంచి బయలుదేరిన బీ2 స్పిరిట్ బాంబర్లు.. పసిఫిక్ మహాసముద్రంలోని గ్వామ్ ఐలాండ్కు చేరుకున్నాయి. అక్కడి నుంచే ఇరాన్పై అమెరికా దాడులు చేసిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. గ్వామ్ ఐలాండ్లోని యూఎస్ ఎయిర్ఫోర్స్ బేస్.. బీ2 స్పిరిట్ బాంబర్లకు ప్రధానమైన స్థావరంగా ఉంది.