
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 11 వేలు దాటాయి. రోజూ కొత్తకేసులు, మరణాలూ ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఒక్కరో జే 1,023 కొత్తకేసులు నమోదవగా, ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 11,487కి చేరింది. మంగళవారం 32 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 390కి చేరింది. దేశంలో 9,318 యాక్వ్టి కేసులుండగా, 1,295 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో పరి స్థితి సీరియస్గా ఉంది. 2,684 కేసులు, 178 మరణాలతో జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 1,561 కేసులు, 30 మరణాలతో ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య20 లక్షలకు దగ్గ రైంది. 19,79,853 మంది వైరస్బారిన పడ్డారు. 1,24,918 మంది చనిపోయారు.