కర్ణాటకలో ఇవాళ రాత్రి నుంచి లాక్ డౌన్

కర్ణాటకలో ఇవాళ రాత్రి నుంచి లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కాకపోవడంతో పాటు.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  లేటెస్టుగా  కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది. ఈ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానున్న లాక్ డౌన్ రెండు వారాల పాటు కొనసాగనుంది. లాక్ డౌన్ తో అన్ని రకాలైన ప్రజా రవాణాను ఆపేస్తున్నట్టు సీఎం యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపింది.

ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని... అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లను కస్టమర్ల కోసం తెరవడానికి వీల్లేదని... అయితే, ఆహారాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది కర్ణాటక సర్కారు.