ప్రారంభోత్సవం చేసిన ఆరు నెలలకే కూలిన టూరిజం కాటేజీ పైకప్పులు

ప్రారంభోత్సవం చేసిన ఆరు నెలలకే కూలిన టూరిజం కాటేజీ పైకప్పులు

నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టూరిజం కాటేజీలోని పైకప్పులు కూలిపోయాయి. గోడలు సైతం క్రాక్ ఇచ్చి దెబ్బతిన్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐదు నెలల కిందటే టూరిజం కాటేజీని అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు.  ప్రారంభోత్సవం చేసిన ఆరు నెలలు కూడా గడవకముందే కాటేజీ పైకప్పులు, గోడలు కూలిపోవడం తీవ్ర విమర్శలకు గురవుతోంది.