
ఓటీటీలో వచ్చిన మలయాళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు టోవినో థామస్. తర్వాత తను నటించిన చిత్రాలు ఇక్కడ రిలీజ్ చేసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. తాజాగా తను ఓ స్ట్రయిట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డ్రాగన్’ చిత్రంలో టోవినో నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరగగా, రీసెంట్గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రంలో తనతోపాటు టోవినో థామస్, బీజు మీనన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది.