ఎట్టకేలకు.. నల్గొండకు రేవంత్

ఎట్టకేలకు.. నల్గొండకు రేవంత్
  • నేడు నిరుద్యోగ ర్యాలీ, నిరసన సభ
  • ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరుపై సస్పెన్స్

నల్గొండ, వెలుగు : పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఆయన  పీసీసీ బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి నల్గొండలో  సభ పెట్టాలని భావించారు. కానీ పార్టీ సీనియర్​ నేతలు,  ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు పడుతుండడంతో ఆయన పర్యటనకు బ్రేక్​లు పడ్డాయి. ఈనెల 26న నల్గొండలో నిరుద్యోగ ర్యాలీ, నిరసన సభ పెట్టాలని రేవంత్​ ప్లాన్​ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ పార్లమెంట్​ సెగ్మెంట్​లో తనకు ముందస్తు సమాచారం లేకుండా రేవంత్​టూర్​ ఖరారు చేయడాన్ని ఉత్తమ్​ సీరియస్​గా తీసుకున్నారు. పార్టీ హైకమాండ్ వద్దకు ఇష్యూను తీసుకెళ్లడంతో అది ఆగిపోయింది. రేవంత్​ కూడా పట్టుబట్టి  హైకమాండ్​ను ఒప్పించి శుక్రవారం నల్గొండలో నిరుద్యోగ మార్చ్​ సభ నిర్వహించనున్నారు. రెండు రోజుల కిందటే  రేవంత్ టీమ్​ నల్గొండకు చేరుకుని  సభను  సక్సెస్​ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. రేవంత్​ పర్యటన డిసైడ్ కావడంతో ఆయన వర్గానికి చెందిన లీడర్లతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఆశిస్తున్న నేతలు సభ సక్సెస్​పై దృష్టి పెట్టారు. నల్గొండ, నకిరేకల్​, మునుగోడు, మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, నాగార్జునసాగర్​ నియోజకవర్గాల నుంచి  జనాన్ని తరలించేందుకు ప్లాన్​ చేశారు. రేవంత్ కు  సీనియర్​ నాయకుడు జానారెడ్డి ఆశీస్సులు ఉండటంతో  నాగార్జునసాగర్​, మి ర్యాలగూడ నుంచి జానా కొడుకు రఘువీర్​ రెడ్డి,  బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్​ నాయక్​  జన సమీకరణ చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశిస్తున్న కొండేటి మల్లయ్య, బీర్ల అయిలయ్య, చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్​ నేత కూడా  జనాన్ని తరలించేందుకు సిద్దమవుతున్నారు. చౌటుప్పుల్​ నుంచి చిట్యాల, నార్కట్​పల్లి మీదుగా ఎంజీ యూనివర్సిటీ వరకు కార్లు, బైకులతో ర్యాలీ జరుగనుంది. నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్​ రెడ్డి, శంకర్​ నాయక్​, చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, చెరుకు సుధాకర్​ తదితరులు రేవంత్​ సభ ఏర్పాట్లు, జన సమీకరణ పైన ఫోకస్​ పెట్టారు. దీనిలో భాగంగా గురువారం ఎంజీ యూ నివర్సిటీలోని విద్యార్ధి సంఘాలు, నల్గొండలోని పలు కోచింగ్​ సెంటర్లు, లై బ్రరీలకు వెళ్లి రేవంత్​ సభకు రావాలని నిరుద్యోగులను కోరారు. 

ఎంపీలు వస్తారా? 

ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నిరుద్యోగ ర్యాలీకి హాజరవుతారా లేదా అన్నది  గురువారం రాత్రి వరకు సస్పెన్స్​గానే ఉంది. గురువారం గాంధీ భవన్​లో జరిగిన దీక్షకు  రేవంత్​ హాజరుకాలేదు. దీంతో  ఉత్తమ్​ రాకపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ర్యాలీకి రాకపోవచ్చునని ఎంపీ వెంకటరెడ్డి ఇదివరకే చెప్పారు. నల్గొండలో  జన సమీకర ణ బాధ్యతలు దుబ్బాక నర్సింహారెడ్డి, చెరుకు సుధాకర్​కు అప్పగించడాన్ని వెంకటరెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. మల్లయ్య, చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, చెరుకు సుధాకర్ ఎంపీ వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ​నకిరేకల్​లో సభ పెట్టి ఆయన పై విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డిని టార్గెట్​ చేసిన అద్దంకి దయాకర్​ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్​ సపోర్ట్​తోనే ఇదంతా జరుగుతుందంటున్న  వెంకటరెడ్డి, రేవంత్​ సభకు తన వర్గం నేతలెవరూ హాజరుకావద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది.  అయితే ఈ సభకు ఇద్దరు ఎంపీలు వస్తారని డీసీసీ  అధ్యక్షుడు శంకర్​ నాయక్​ చెప్తున్నారు.  వారు క్లాక్​టవర్​ వద్ద జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు. సీనియర్​ నాయకులు జానారెడ్డి, దామోదర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్​ ఈ టూర్​లో పాల్గొంటున్నారు.  

రేవంత్​ పర్యటన ఇలా..

రేవంత్​ రెడ్డి  మధ్యాహ్నం2.30 గంటలకు చౌటుప్పుల్​కు చేరుకుంటారు.  అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. 3 గంటలకు చిట్యాల, 3.30 గంటలకు నార్కట్​పల్లికి చేరుకుంటారు.  నార్కట్​పల్లి నుంచి  బైక్​ ర్యాలీ మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎంజీ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు నల్గొం డలోని మర్రిగూడ బైపాస్ వద్ద జగ్జవన్​ రాం, అంబేద్కర్​ విగ్రహాలకు పూల మాలలు వేసి పాదయాత్ర ప్రారంభిస్తారు.  రాత్రి 7 గంటలకు  క్లాక్​ టవర్​ సెంటర్​ వద్ద   సభ జరుగుతుంది.