కేసులతో బెదిరించి రాజకీయాలు నడపలేరు

కేసులతో బెదిరించి రాజకీయాలు నడపలేరు

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అసమర్థత మీద పోరాడుతున్న వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా పీడీ యాక్టు పెట్టి వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసులతో రాజకీయాలు ఎక్కువ కాలం నడవవన్న విషయాన్ని మంత్రి అజయ్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రతి లెక్కా తేలుస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.