రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అసమర్థత మీద పోరాడుతున్న వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా పీడీ యాక్టు పెట్టి వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసులతో రాజకీయాలు ఎక్కువ కాలం నడవవన్న విషయాన్ని మంత్రి అజయ్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రతి లెక్కా తేలుస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అసమర్ధత మీద పోరాడుతున్న ఖమ్మం కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తల పై అక్రమంగా
— Revanth Reddy (@revanth_anumula) April 16, 2022
పీడీ యాక్టు పెట్టి వేదిస్తున్నారు.
కేసులతో రాజకీయం ఎక్కువకాలం నడవదని మంత్రి అజయ్ గుర్తు పెట్టుకోవాలి.
ప్రతి లెక్కా తేలుస్తాం.
కార్యకర్తలను కాపాడుకుంటాం. pic.twitter.com/Lk30e3pTg5