- ఎల్లారెడ్డిపేట మండలంలో అదుపుతప్పిన ట్రాక్టర్
ఎల్లారెడ్డిపేట, వెలుగు: పొలం దున్నేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో డ్రైవర్ చనిపోయాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జితేందర్(34 ) అదే గ్రామానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్ పై డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
గురువారం పొలం దున్నేందుకు కేజీ వీల్స్ ను ట్రాక్టర్ నాగండ్లకు తగిలించుకొని వెళ్తున్నాడు. గ్రామ శివారులోని స్పీడ్ బ్రేకర్ వద్ద ట్రాక్టర్ జంప్ కావడంతో కేజీ వీల్స్ ఇరువైపులా పడిపోయి ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీ కొట్టింది. డ్రైవర్ సీట్ లో ఇరుక్కున్న జితేందర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
