టర్కీ రాజధానిలో పేలుడు.. ఆరుగురు మృతి

టర్కీ రాజధానిలో పేలుడు.. ఆరుగురు మృతి

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో షాపింగ్ కు ప్రధాన కేంద్రమైన ఇస్తిక్ లాల్ వీధిలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, దాదాపు 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలం చుట్టూ  పోలీసు బలగాలను మోహరించారు.  భారీ శబ్దంతో పేలుడు జరిగిన వెంటనే ఇస్తిక్ లాల్ వీధిని దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రజల హాహాకారాలు మిన్నంటాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని తమ పిల్లలను ఎత్తుకొని కొందరు తల్లిదండ్రులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు పెద్దసంఖ్యలో అంబులెన్స్ లు ఇస్తిక్ లాల్ వీధికి చేరుకున్నాయి. పేలుడు నేపథ్యంలో ఇస్తాంబుల్ నగరంపై గగనతలం నుంచి కూడా గస్తీని ముమ్మరం చేశారు. పోలీసులు హెలికాప్టర్ల ద్వారా ఇస్తాంబుల్ లోని రద్దీగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.  అయితే ఈ పేలుడు ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియరాలేదు.