మార్చి 12 నుంచి 22 వరకు పలు రైళ్లు దారి మళ్లింపు

మార్చి 12 నుంచి 22 వరకు పలు రైళ్లు దారి మళ్లింపు

సికింద్రాబాద్, వెలుగు:  ట్రాఫిక్​బ్లాక్​కారణంగా వివిధ స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను ఈ నెల 12 నుంచి 22 వరకు దారి మళ్లించినట్లు, మరికొన్నింటిని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది.  12, 15, 16, 19 తేదీల్లో కాచిగూడ, మహబూబ్​నగర్ మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​రైళ్లు షాద్​నగర్ వెళ్లవు. వాటిని దారి మళ్లిస్తున్నారు. 20న హౌరా-– శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్​ఫాస్ట్​ఎక్స్​ప్రెస్​ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్​లను రద్దు చేశారు. 22న  శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-– హౌరా, పూరి-– యశ్వంత్​పూర్​మధ్య నడిచే ఎక్స్​ప్రెస్ రైళ్లను గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్​లను రద్దు చేశారు.