రాచకొండలో 14 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ

రాచకొండలో 14 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ

ఎల్​బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​గా బి. రవికుమార్, ఉప్పల్ ఇన్ స్పెక్టర్​గా ఎన్. ఎలక్షన్ రెడ్డి, పోచారం ఐటీ కారిడార్ ఇన్​స్పెక్టర్​గా బి. రాజు, చర్లపల్లి ఇన్​స్పెక్టర్​గా వై. రవీందర్, నాచారం ఇన్ స్పెక్టర్​గా  ఎన్. నందీశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఇన్​స్పెక్టర్​గా బి. సత్యనారాయణ, మేడిపల్లి ఇన్​స్పెక్టర్​గా ఆర్. గోవింద రెడ్డి, మీర్ పేట ఇన్​స్పెక్టర్​గా ఎం. కాశీ విశ్వనాథ్, ఇబ్రహీంపట్నం ఇన్​స్పెక్టర్​గా పి. ఆంజనేయులును బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఐదుగురిని ఎస్​వోటీ, సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్​కు బదిలీ చేశారు.