- రెండు నెలల్లోనే టీఆర్ఎస్తో కాంట్రాక్టు ముగిసిందనే ప్రచారం
- బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ బిజీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు నెలల కిందట హడావుడి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్ కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయింది. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరఫున సర్వేలు చేపట్టిన పీకే టీమ్.. సడెన్గా సర్వేలను ఆపేసింది. ఇక్కడున్న 40 సర్వే టీమ్లను రెండు వారాల కిందటే ఏపీకి పంపించింది. మరోవైపు ప్రగతిభవన్లో కేసీఆర్ తో వరుసగా చర్చలు జరిపిన పీకే.. ఇటీవల తెలంగాణకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్కు, ప్రశాంత్ కిశోర్కు మధ్య కాంట్రాక్టు రెండు నెలల్లోనే ముగిసిపోయిందా? అనే చర్చ మొదలైంది. బీహార్ రాజకీయ వ్యవహారాల్లో పీకే బిజీగా ఉంటున్నారు. అక్కడే అక్టోబర్ 2 నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఆయన తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పీకే ఆధ్వర్యంలోని ఐప్యాక్ టీమ్ తెలంగాణలో సర్వేలను ఆపేసి, సిబ్బందిని ఏపీకి పంపించడం చర్చనీయాంశంగా మారింది. పోయిన ఎన్నికల్లో ఏపీలో జగన్తో ఒప్పందం చేసుకున్న ఐప్యాక్.. ఈసారి కూడా ఆయన తరఫున పని చేస్తోంది.
రిపోర్టు బయటకు.. బెడిసికొట్టిన ఒప్పందం
తెలంగాణలో కేసీఆర్తో కుదిరిన ఒప్పందంతో నాలుగు నెలల కిందటే ఐప్యాక్ఏజెన్సీ హైదరాబాద్లో హెడ్ఆఫీస్ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా సర్వేలు, అభ్యర్థుల ఎంపిక మొదలు సోషల్ మీడియా క్యాంపెయిన్, జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు సూచనలను అందించే కీలకమైన బాధ్యతలను పీకే టీమ్కు టీఆర్ఎస్ అప్పగించింది. ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయంతో పాటు పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ఎలక్షన్ల గెలుపోటములపై డబ్బుల ప్రభావాన్ని అంచనా వేసే మొదటి విడత సర్వేను ఈ టీమ్ పూర్తి చేసింది.స్వయంగా పీకే గజ్వేల్నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సగానికిపైగా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పీకే తన తొలి సర్వే రిపోర్టును కేసీఆర్కు అందించినట్లు బయటకు పొక్కింది. అప్పట్నుంచీ పీకే టీమ్కు, టీఆర్ఎస్కు మధ్య గ్యాప్ పెరిగిందని.. ముందుగా చేసుకున్న ఒప్పందం బెడిసికొట్టిందనే ప్రచారం జరిగింది. దీంతో సర్వేలు, పార్టీ వ్యవహారాలు, జాతీయ పార్టీ విషయాల్లో తలదూర్చకుండా కేవలం సోషల్మీడియా పోస్టింగ్లకు పరిమితం కావాలని ఐప్యాక్ టీమ్ కు టీఆర్ఎస్ కండీషన్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో తెలంగాణలో కాంట్రాక్టు ఉన్నా లేనట్లేనని.. ఐప్యాక్ ఇక్కడ నియమించుకున్న ఉద్యోగులందరినీ వరుసబెట్టి ఏపీకి బదిలీ చేస్తోందనే డిస్కషన్హాట్ టాపిక్గా మారింది.