
హైదరాబాద్, వెలుగు: వుడ్ వర్కింగ్, ఫర్నిచర్ ప్రొడక్షన్ టెక్నాలజీపై 'ఇండియావుడ్ 2024' పేరుతో ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో సమ్మిట్ జరగనుంది. ఈ ప్రదర్శనలో 950 పైగా కంపెనీలు, 50 పైగా దేశాల నుంచి 75 వేలకు పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొంటారు. కొత్త టెక్నాలజీలపై, ఇన్నోవేషన్లపై ఈ సందర్భంగా అవగాహన కలిగిస్తారు.
ప్రపంచంలోని పరిశ్రమ నాయకులు, సాంకేతికత సరఫరాదారులు, కొనుగోలుదారులను ఈ సమ్మిట్ ఒకచోట చేర్చుతుంది. ఈ సందర్భంగా సెమినార్లు, వర్క్షాప్లు, ప్యానెల్ చర్చలు ఉంటాయి.