
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్లు ఓ వ్యక్తికి నడిరోడ్డుపై గుండుగీయించారు. అంతేగాకుండా నోట్లో మూత్రం పోసి అతడివద్ద ఉన్న డబ్బులును లాక్కున్నారు. బాధితుడు వేడుకున్నా వాళ్లు వినలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ కు చెందిన బాధితుడు రఫీకుల్ ఓ వంటవాడు. జులై 27న ఇమాంబక్షన్ లో ఓ ప్రాంతంలో వంట చేసి బైక్ పై తిరిగి వస్తుండగా. ఐదుగురు ట్రాన్స్ జెండర్లు జోహ్రీ ఇటుకబట్టి దగ్గర అతడిని చుట్టుముట్టి అతడిపై దాడి చేశారు. అతని తలను నీళ్లల్లో ముంచి గుండు గీసారు. బాధితుడు ఏడుస్తుండగా మరో ట్రాన్స్ జెండర్ నోట్లో మూత్రం పోశాడు. అతని దగ్గర ఉన్న వెయ్యి రూపాయల నగదును దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా అతడిని నపుంసకుడిగా చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పొలాల్లో పనిచేస్తున్న వారు వచ్చి అతడిని కాపాడారు.
బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు.ఆ ప్రాంతంలోని రెండు ట్రాన్స్ జెండర్ గ్రూప్ ల మధ్య జరిగిన పోటీ వల్ల ఘటన జరిగినట్లు చెప్పారు.