గ్రీన్​ చానల్ ద్వారా ఆర్గాన్స్​ తరలింపు

గ్రీన్​ చానల్ ద్వారా ఆర్గాన్స్​ తరలింపు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి లైవ్ ఆర్గాన్స్​ను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్​లోని సెవెన్ హిల్స్​ ఆస్పత్రి నుంచి ఇండిగో విమానంలో రాత్రి 7.15 నిమిషాలకు శంషాబాద్​కు ఆర్గాన్స్ (లంగ్స్) చేరుకున్నాయి.

వీటిని గ్రీన్​చానల్ ​ద్వారా అంబులెన్స్​లో 8.15 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు శంషాబాద్ ఆర్​జీఏ ట్రాఫిక్ సీఐ రాజు తెలిపారు.