
టిప్పర్, ఆటో, రిక్షా కార్మికుల జేఏసీ డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: టీఎస్ స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆ కార్మికుల జేఏసీ చైర్మన్ సూరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి తరలించేందుకు రాష్ట్ర సర్కారు 2015లో టిప్పర్లు కేటాయించిందన్నారు. చెత్త తరలించే కార్మికులుగా పనిచేస్తున్న వారికి హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. స్వచ్ఛ ఆటో, టిప్పర్ రిపేర్లకు నెలకు రూ.20 వేలు అవుతుందని, పాడైన వెహికల్స్ స్థానంలో కొత్తవి ఇవ్వాలన్నారు. సమావేశంలో వీరేశ్, గోపి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.