- ఒక్కసారిగా పడిపోయిన టెంపరేచర్.. చలి తీవ్రతతో పెరుగుతున్న బాధితులు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని జనాలను సీజనల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రధానంగా జ్వరం, న్యూమోనియా, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడుతూ డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. సీరియస్ అయినవారు వెంటనే అడ్మిట్అవుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులపై సీజనల్ ఫీవర్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఫీవర్త్వరగా తగ్గకపోవడంతో వచ్చిన వారే మళ్లీ వస్తున్నారని పేర్కొంటున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వైరల్ ఫీవర్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీలో 15 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.
పెరుగుతున్న కేసులు
ప్రధానంగా హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ క్లినిక్స్కు పేషెంట్లు భారీగా వెళ్తున్నారు. ఒక్కో క్లినిక్కు రోజూ వందల సంఖ్యలో వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సిటీలోని ప్రధాన హాస్పిటల్స్అయిన గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్స్లోనూ రద్దీ పెరిగింది. ఫీవర్ హాస్పిటల్లో బుధవారం 540 ఓపీ కేసులు నమోదు కాగా, మంగళవారం 491 వచ్చాయి. రోజు 20 మంది దాకా ఇన్పేషెంట్స్ వస్తున్నారని డాక్టర్లు తెలుపుతున్నారు. వీరిలో ప్రధానంగా యువత, మిడిల్ ఏజ్ గ్రూప్ వారు ఉంటున్నారన్నారు. ఫీవర్ హాస్పిటల్లో టైఫాయిడ్, గవదబిల్లల కేసులే ఎక్కువ నమోదవుతున్నాయి. గవదబిల్లలు తగ్గడానికి సమయం పడుతుండటంతో ఇన్పేషెంట్స్ సంఖ్య పెరుగుతుందంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసులు తక్కువేనని ఫీవర్ హాస్పిటల్డాక్టర్లు పేర్కొంటున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో సీజనల్ ఫీవర్స్ కేసులు పెరిగాయి. వందలో 80 కేసులు జ్వరాలకు సంబంధించినవే ఉంటున్నాయి. పిల్లలు, మహిళలు ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ప్రధానంగా న్యూమోనియా, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి.
– విజయ భాస్కర్, కన్సల్టెంట్, హెలియోస్ హాస్పిటల్