- మూడోసారి గెలుపు కోసం మల్లు రవి ఆరాటం
- ‘మోదీ’ ఛరిష్మా, లోకల్ కార్డు, తండ్రి బలాన్ని నమ్ముకున్న భరత్
- సొంత జిల్లాపై మాజీ పోలీస్ బాస్ ఆర్ఎస్పీ నమ్మకం
నాగర్కర్నూల్. వెలుగు: నాగర్కర్నూల్ లోక్సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్నుంచి సీనియర్ లీడర్, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్ప్రసాద్కు టికెట్ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీంతో నాగర్కర్నూల్లో అప్పుడే పార్లమెంట్పోరు మొదలైంది.
కాంగ్రెస్కు కిక్ఇచ్చిన అసెంబ్లీ లీడ్
నాగర్ కర్నూల్పార్లమెంట్పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇందులో ఐదు స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్గెలిచింది. కొల్లాపూర్నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి డీసీసీ ప్రెసిడెంట్డా.వంశీకృష్ణతో పాటు కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పట్టుసాధించింది. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్6,39,628 ఓట్లు సాధించి 1,05,227 లీడ్తో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే 5,34,401 ఓట్లు పొందిన బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది. రెండు పార్టీల మధ్య దాదాపు 11 శాతం ఓట్ల తేడా ఉంది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన సంతోషం లేకుండా స్థానిక సంస్థల మెజార్టీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ పనితీరు, ఫలితాలతో దాదాపు లక్ష పై చిలుకు మెజార్టీ సాధించింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనే దాదాపు 80వేల మెజార్టీ వచ్చింది. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడం, మంత్రి జూపల్లికి ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వడం కూడా కాంగ్రెస్కలిసొచ్చే అంశాలు. ఊపుమీదున్న కాంగ్రెస్క్యాడర్అసెంబ్లీ ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమాతో ఉంది. కాంగ్రెస్టికెట్దక్కించుకునేందుకు మల్లు రవి, సంపత్చివరి వరకు పోటీ పడ్డా హైకమాండ్ మల్లు రవి వైపే మొగ్గు చూపింది. దీంతో ఆయన హైకమాండ్కు గెలుపును బహుమతిగా ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 పార్లమెంట్ఎన్నికల్లో మల్లు రవి ఓడిపోయినా 1991, 1998లో రెండు సార్లు ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జడ్చర్ల అసెంబ్లీ నుంచి మూడు సార్లు పోటీ చేసినా నాగర్కర్నూల్పార్లమెంట్నియోజకవర్గంలోని కాంగ్రెస్నాయకులు, క్యాడర్తో వ్యక్తిగత అనుబంధం కొనసాగించారు. బీఆర్ఎస్అధికారంలో ఉన్న సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్అచ్చంపేట నుంచి చేపట్టిన ఆకస్మిక పాదయాత్రను సమన్వయం చేశారు. నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి కాంగ్రెస్ టికెట్ల పేచీ పరిష్కారానికి రేవంత్కు మల్లు కుడిభుజంగా నిలబడ్డారు. టికెట్రేసులో చివరి వరకు పోటీపడిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మెత్తబడడమే కాకుండా మల్లు గెలుపుకోసం పని చేస్తామని ప్రకటించడం అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కలిసొస్తుందని భావిస్తున్నారు.
లోకల్ స్లోగన్, మోదీ హవాపై ఆశలు
రెండోసారి బీజేపీ టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని కాదని కొత్తగా పార్టీలో చేరిన భరత్కు టికెట్ఇచ్చిన బీజేపీ హైకమాండ్ లోకల్లీడర్స్మాటకే ప్రియారిటీ ఇచ్చింది. దీంతో భరత్ప్రసాద్తాను స్థానికుడినని, సిట్టింగ్ఎంపీ రాములు కొడుకుగా ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు. అచ్చంపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎంపీ పోతుగంటి రాములుకు నాగర్కర్నూల్జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పరిచయాలున్నాయి. 2019 పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్మధ్య పోరులో అప్పటి బీఆర్ఎస్అభ్యర్థి అయిన రాములు 1,89,668 ఒట్ల మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్హైకమాండ్తిరస్కరించడంతో అవమానాలతో ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరడమే కాకుండా కొడుకుకు పార్టీ టికెట్ ఇప్పించుకోగలిగారు. కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలతో ప్రత్యక్ష సంబంధాలున్న రాములు పాత బీఆర్ఎస్ లీడర్ల మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మల్లురవి స్థానికేతరుడనే నినాదం తెరపైకి తెస్తున్నారు. ప్రధాని మోదీ హవా ఆదుకుంటుందనే ధీమాతో ఉన్నారు. ఆయోధ్య రామ మందిర నిర్మాణం, మధ్యతరగతి వర్గాలు, స్టూడెంట్స్, యూత్, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఈసారి మోదీకి మద్దతిస్తాయన్న ఆశతో ఉన్నారు. టికెట్దక్కని పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని వ్యతిరేకిస్తున్న లోకల్లీడర్స్బ్యాచ్..ప్రచారానికి ఆమెను దూరంగా ఉంచడం పార్టీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ సైతం స్థానిక బీజేపీ నాయకత్వ వ్యవహరశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గద్వాల,అలంపూర్ నియోజకవర్గాల్లో డీకే అరుణ పట్టు తమకు ప్లస్అవుతుందని అంచనా వేసుకుంటున్నారు.
ఆర్ఎస్పీకి క్యాడర్ తసహకరిస్తుందా?
బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుల ప్రయోగం పురిట్లోనే తిరగబడి ‘ఏనుగు’ దిగిన ఆర్ఎస్ప్రవీణ్కుమార్నాగర్కర్నూల్బీఆర్ఎస్అభ్యర్థిగా రంగంలోకి రావడంతో మూడు బలమైన పార్టీల మధ్య పోరు అనివార్యమైంది. అలంపూర్నియోజకవర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు అనుకూలమని భావిస్తున్నా అక్కడ కాంగ్రెస్, డీకే అరుణ ప్రభావం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్రిజల్ట్తో నిరాశకు గురైన బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యేలు ఫలితాలపై ఇప్పటికి పోస్ట్మార్టం చేసుకుంటున్నారు. అయినా పార్లమెంట్ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను ఆర్ఎస్పీ ఎంత వరకు సమన్వయం చేసుకుంటారు? పార్టీ క్యాడర్ఎంత వరకు సహకరిస్తుందనే దానిపైనే ఆయన గెలుపు ఆధారపడి ఉంటుంది. అయితే, కవిత అరెస్ట్ఎపిసోడ్ విపరీతంగా చర్చకు రావడం ఆ పార్టీ క్యాడర్కు ఆందోళన కలిగిస్తోంది.