
హైదరాబాద్సిటీ, వెలుగు: ట్రిపుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) ప్రాజెక్టుకు సంబంధించి గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన పాత అలైన్మెంట్నే అమలు చేయాలని ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల సంఘం డిమాండ్ చేసింది. పాత అలైన్మెంట్ను మార్చి కొత్త అలైన్మెంట్ఇవ్వడం సరికాదని, పాత అలైన్మెంట్ ప్రకారమే రీజనల్ రింగ్రోడ్నిర్మించాలని కోరింది.
సోమవారం ఆ సంఘం ప్రతినిధులు ప్రాజెక్ట్స్చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డిని కలిసి, కొత్త అలైన్మెంట్పై అభ్యంతరాలు తెలిపారు. హెచ్ఎండీఏ నోటిఫికేషన్లో మ్యాప్లు ప్రదర్శించలేదని, వెబ్సైట్లో జియో కోఆర్డినేట్స్ అర్థం కాని విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు