
కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు దాటినా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది త్రిష. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తాజాగా ‘బృంద’ వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. త్రిష నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది.సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మంగళవారం ఈ సిరీస్ రిలీజ్ డేట్తో పాటు టీజర్ను విడుదల చేశారు. ఆగస్టు 2 నుంచి సోనీ లివ్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్ విడుదల కానుంది. ‘మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం.. వీటితో కాదు మనం పోరాడాల్సింది. మనలో ఉన్న మంచితో.. అది మన నుంచి పోకుండా..’ అనే డైలాగ్తో ప్రారంభమైన టీజర్ సిరీస్పై ఆసక్తిని పెంచింది. ఇందులో త్రిష పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంది.
ఈ ప్రపంచంలోకి మనం రాకముందు.. ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లే ముందు ఎంతోకొంత మంచి చేసి వెళ్లడం మనం బాధ్యత’ అంటూ త్రిషకు తన బాధ్యతను గుర్తు చేసే డైలాగ్ ఆకట్టుకుంది. ఇంటెన్స్ రోల్లో ఆమె కనిపిస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ ‘ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉంటుంది. త్రిషగారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది’ అని చెప్పాడు.