దర్శకుడిగా త్రివిక్రమ్ కుమారుడి ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

దర్శకుడిగా త్రివిక్రమ్ కుమారుడి ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వం అనే సర్వ సాధారణం. బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవడం, క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవడం, స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా మారడం. ఇప్పుడు అలాంటి మరో వారసుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. అతను మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కుమారుడు రిషీ మనోజ్(Rishi manoj). ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : మూడింటిలో ఇదే కామన్ పాయింట్.. ఆడియన్స్ గమనించారా!?

చాలా కాలంగా రిషీ మనోజ్ సినిమా మేకింగ్ గురించి కోచింగ్ తీసుకుంటున్నాడట. ఇప్పుడు ఆ ట్రైనింగ్ పూర్తవడంతో దర్శకుడిగా మొదటి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ధ్రువీకరించారు. ఇటీవల ఆమె తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు  సాయి సౌజన్య. అయితే.. రిషీ మనోజ్ తన మొదటి సినిమా ఎవరితో చేస్తున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు. దీన్ని బట్టి చూస్తే.. అతి త్వరలో త్రివిక్రమ్ కుమారుడు రిషీ మనోజ్ మెగా ఫోన్ పట్టనున్నాడు అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. చూడాలి.. మాటల మాంత్రికుడి కొడుకు తన మొదటి సినిమా కోసం ఎలాంటి కథను, ఏ హీరోను ఎంచుకుంటాడా అని.