9 కిలోమీటర్ల రోడ్డును 28 కిలోమీటర్లకు పొడిగించిన్రు
మంత్రి భూములు కాపాడేందుకు మారిన అలైన్మెంట్
పాలమూరు జిల్లాలో రెండు నేషనల్హైవేలను కలిపేందుకు చేపట్టిన ‘భారత్మాల’ లింకు రోడ్డును టీఆర్ఎస్ లీడర్లు మలుపులు తిప్పుతున్నారు. ఫస్ట్ అలైన్మెంట్ సర్వే ప్రకారం 9 కిలోమీటర్లుగా ఉన్న రోడ్డు.. మంత్రి భార్య పేరిట ఉన్న భూమి మీదుగా పోతుండడంతో అలైన్మెంట్ మార్చి 28 కిలోమీటర్లకు పొడిగించారు. దీంతో ఇప్పుడా రోడ్డు ఏకంగా పాలమూరు కొత్త కలెక్టరేట్ కాంపౌండ్లోంచే పోతోంది. అంతేకాదు పెద్దసంఖ్యలో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయి సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి.
మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో రెండు నేషనల్హైవేలను కలిపేందుకు ‘భారత్మాల’ కింద చేపట్టిన లింకు రోడ్డు నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తే సరిపోయేదానికి టీఆర్ఎస్ లీడర్ల భూముల డిమాండ్ పెంచుకునేందుకు వేరే పాయింట్కు మార్చి, 28 కిలోమీటర్లు పెంచిన్రు. తీరా ఈ 28 కిలోమీటర్ల రోడ్డులో ఫస్ట్ అలైన్మెంట్సర్వే ప్రకారం మంత్రి భార్య పేరిట ఉన్న భూమి పోతుండడంతో వెంటనే చక్రం తిప్పిన్రు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి మరోసారి అలైన్మెంట్ మార్చడంతో ఇప్పుడా రోడ్డు ఏకంగా పాలమూరు కొత్త కలెక్టరేట్కాంపౌండ్లోంచే పోతోంది. అంతేకాదు పెద్దసంఖ్యలో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయి సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి.
19 కిలోమీటర్లు పెంచిన్రు..
హైదరాబాద్– బెంగళూరు 44 వ నంబర్ జాతీయ రహదారి మహబూబ్నగర్ జిల్లా మీదుగా పోతోంది. నల్గొండ జిల్లా కోదాడ నుంచి మహబూబ్నగర్జిల్లా జడ్చర్ల, పాలమూరు మీదుగా నారాయణపేట జిల్లా మాగనూరు వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం ఎన్హెచ్167గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ 44, 167 జాతీయ రహదారులను కలిపేందుకు ‘భారత్మాల పరియోజన స్కీం’ కింద కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్హైవే అథారిటీ ఆఫీసర్లు భారత్మాల సర్వే కోసం కన్సల్టెంట్ఏజెన్సీని పెట్టుకున్నారు. 44వ జాతీయ రహదారి పై గల భూత్పూర్నుంచి తాటికొండ శివారు, గాజులపల్లి, జమిస్తాపూర్నుంచి నేరుగా ధర్మాపూర్వద్ద 167 నేషనల్హైవేను కలపాలని నిర్ణయించి, సర్వే కు డిసైడ్ అయ్యారు. ఈ గ్రామాల మీదుగానైతే 8 నుంచి 9 కిలోమీటర్ల లింకు రోడ్డు కొత్తగా వేస్తే సరిపోయేది. ఎక్కువ భాగం సర్కార్భూములే ఇందులో పోతాయి. చాలా తక్కువ మొత్తంలో రైతులు భూములు కోల్పోతారు. శివారు నుంచి వెళ్తుండటంతో గ్రామాలపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కొందరు టీఆర్ఎస్ లీడర్ల భూములకు డిమాండ్కోసం 9 కిలోమీటర్ల రోడ్డును కాదని ఎన్హెచ్44పైగల అంబట్ పల్లి గ్రామం నుంచి రోడ్డును డైవర్ట్చేసి సిద్దాయిపల్లి, అమిస్తాపూర్, పాలకొండ, క్రిష్టియన్పల్లి, అల్లీపూర్, ధర్మాపూర్ మీదుగా 28 కిలోమీటర్లకు ప్లాన్ చేశారు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి సర్వే చేయించారు. దీనివల్ల చాలామంది పేద రైతుల భూములు పోతున్నాయి. ఆయా గ్రామాల్లో పెద్దసంఖ్యలో ఇండ్లతో పాటు వందల ఎకరాల భూములు పోనున్నాయి. సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్తాయనే అంచనాలు ఉన్నాయి.
పోతున్న కొత్త కలెక్టరేట్ భూమి
లింకు రోడ్డు ఫస్ట్అలైన్మెంట్ ప్రకారం పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ భార్య శారద పేరు మీద సర్వే నం. 258లో ఎకరన్నర పొలంలోని కొంత భాగం పోతోంది. రోడ్డు అవతల ఆయనకు ఫాంహౌస్కూడా ఉంది. దీంతో ఆఫీసర్లపై ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఫలితంగా నేషనల్ హైవే, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ఆఫీసర్లు భారత్మాల రూట్మార్చేశారు. తాజా అలైన్మెంట్ ప్రకారం కొత్తగా సర్వే నం. 279లో రూ. 32 కోట్లు పెట్టి అన్ని హంగులతో నిర్మిస్తున్న కలెక్టరేట్ఆవరణలోంచి లింకురోడ్డును మళ్లించేశారు. దీనిపై అధికారులు ఫైనల్ సర్వే కూడా పూర్తి చేసి అనుమతులు తెచ్చుకున్నారు. ఈ రోడ్డు కంప్లీట్అయితే కలెక్టరేట్ భూమి మూడెకరాలు పోతుంది. కలెక్టరేట్ బిల్డింగ్కి రహదారి మధ్య 10 మీటర్లే మిగుల్తుంది. అన్ని జిల్లాల్లో విశాలమైన కలెక్టరేట్లు నిర్మించి.. ఇంటర్నల్ రోడ్లు, హెలిప్యాడ్లు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కానీ కొత్త రోడ్డు కారణంగా పాలమూరు కలెక్టరేట్పూర్తిగా కళ తప్పనుంది. వాహనాల రద్దీతో కలెక్టరేట్లో ప్రశాంతత గురించి మరచిపోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రూ. వంద కోట్ల బైపాస్ రోడ్డు వృథాయేనా..
మహబూబ్నగర్జిల్లా కేంద్రంమీదుగా వెళ్లే 167 హైవే నుంచి భారీ వెహికల్స్టౌన్లో కి రాకుండా ఇటీవలే రూ. 100 కోట్లతో ఎస్వీఎస్హాస్పిటల్నుంచి క్రిస్టియన్పల్లి వరకు బైపాస్రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును భూత్పూర్, మహబూబ్నగర్రోడ్డుకు అనుసంధానించారు. భవిష్యత్తులో ఈ బైపాస్ను క్రిస్టియన్పల్లి, బండమీదపల్లి, పాలమూరు యూనివర్సిటీ వెనక నుంచి ధర్మాపూర్ వరకు కలపాలని నిర్ణయించారు. ఈ రోడ్డును కలిపినా 9 కిలోమీటర్లతో రెండు హైవేలు లింక్ అయ్యేవి. ఈ ఫైలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వద్ద పెండింగ్లో ఉండగానే దీనికి సమాంతరంగా భారత్మాలను తీసుకోపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
అలైన్మెంట్ మార్చాలని గడ్కరికి లెటర్ రాశా
భారత్మాల ఫస్ట్సర్వే కాదని.. ఇంకో సర్వే.. ఆ సర్వేలో తమ భూములు పోతున్నాయని మరో సర్వే.. ఇలా చేస్తూ పోయారు. చివరాఖరుకు కలెక్టరేట్పోయేలాగా సర్వే చేశారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం చేశారో అందరికీ అర్థం అవుతోంది. వెంటనే ఈ అలైన్మెంట్మార్చాలని గడ్కరీకి లెటర్రాశా. ఢిల్లీకి పోయి కలుస్తా. అందరి జాతకాలు బయటపెడ్తా. - ఏపీ. జితేందర్రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ నేత, మహబూబ్నగర్
మంత్రి భార్య జాగా పోకుండా ఉండేందుకే..
పాలమూరును అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొనే మంత్రి శ్రీనివాస్గౌడ్ తన భార్య పేరు మీద ఉన్న జాగా పోతున్నందుకే భారత్మాలను కలెక్టరేట్లోకి మార్చిండు. దీని పక్కనే ఉన్న తన ఫాం హౌస్కు డిమాండ్ రావాలనే కలెక్టరేట్ను అక్కడ కట్టించిండు. ఇప్పుడు భార్య పేరు మీద జాగా కోసం భారత్మాల పక్కనే పోయేలాగా దీన్ని రీ సర్వే చేయించిడు. దీనిపై విచారణ జరగాలే. మార్చిన అలైన్మెంట్వల్ల వెయ్యి మంది నిర్వాసితులు అవుతారు. ఇప్పటికే ఇద్దరు గుండె పలిగి చనిపోయిండ్రు.- వెంకటేశ్, టీపీసీసీ కార్యదర్శి, మహబూబ్నగర్
అసత్య ప్రచారం మానుకోవాలె
రోడ్డు వేయాలంటే భూమి మీదే పోవాలే. ప్రాజెక్టు కట్టాలన్నా భూమే కావాలి. ఆ రోజు ఒకటికి నాలిగింతలు ఎక్కువిచ్చి భూమిని కొన్నాం. ఈ రోజు ధర లక్షలు పలుకుతోంది. అయితే భారత్మాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు. అలైన్మెంట్మార్చే విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలి. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. రూట్మార్చేందుకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్తా. - పాల్కొండ పల్లెప్రగతిలో మంత్రి శ్రీనివాస్గౌడ్