ఎంపీ అర్వింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ నేతల ధర్నా

ఎంపీ అర్వింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ నేతల ధర్నా

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. చేపూర్ పసుపు రైతులమంటూ.. అర్వింద్ ఇంటి ముందు పసుపు కొమ్ములు కుప్పగా పోసి నిరసన తెలిపారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి విఫలమైనందునకు నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇదంతా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ కవిత జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిన్న నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఎంపీ అర్వింద్ ధర్నా చేశారు.

సైన్యంలో చేరిన అమరవీరుడి భార్య

కోల్‌కతాపై 75 రన్స్‌ తేడాతో లక్నో గెలుపు