మంచిర్యాల జిల్లా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఎంపికైనక సందర్భంగా భారీ ర్యాలీ, స్వాగతం ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో బాల్క సుమన్ తో పాటు..భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు మాస్క్ లు ధరించలేదు, సోషల్ డిస్టెన్స్ పాటించ లేదు. సుమారు రెండు వేల కి పైగా బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. మాకు కరోనా ఆంక్షలు వర్తించవు.. మేము పాటించము అన్నట్టుగా బాల్క సుమన్ స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
మరిన్ని వార్తల కోసం...