లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. వాకౌట్

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. వాకౌట్

పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకు రావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలని టీఆరఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు.