నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ విజ‌యం

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్  విజ‌యం

నాగార్జున సాగర్ బైపోల్ లో TRS గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 25రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18వేల 449 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది టీఆర్ఎస్. ప్రతీ రౌండ్ లో అధికార పార్టీ లీడ్ లో కొనసాగింది. 25రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగితే.. ఒక్క 10వ రౌండ్ లో మాత్రమే కాంగ్రెస్ కు 175 ఓట్ల లీడ్ వచ్చింది. గుర్రంపోడు మండలంలో 3వేల 8 ఓట్లు, పెద్దవూరలో 4వేల 640 ఓట్లు, తిరుమలగిరి మండలంలో 2వేల 713, నిడమనూరు మండలంలో 5వేల 642 ఓట్ల ఆధిక్యం సాధించింది టీఆర్ఎస్. ఒక్క అనుముల మండలంలో మాత్రమే కాంగ్రెస్ కు లీడ్ వచ్చింది. అది కూడా 447 ఓట్ల ఆధిక్యం మాత్రమే సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి. కాసేపట్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపుపై.. అధికారకంగా ప్రకటన చేయనున్నారు అధికారులు.