
- బాగ్దాద్ ఎంబసీపై దాడిని సీరియస్గా తీసుకున్న ట్రంప్
బాగ్దాద్: ఇరాన్లోని తమ పౌరులకు గానీ, ఆస్తులకు గానీ ఏం జరిగినా టెహరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ట్రంప్ చెప్పారు. ఇది వార్నింగ్ కాదు.. థ్రెట్ అని ట్రంప్ ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ చేసిన ట్వీట్లో ఆయన ఈ విషయాన్నీ ప్రస్తావించారు. మిడిల్ ఈస్ట్ రీజియన్కు మరిన్ని బలగాలను పంపుతున్నట్లు డిఫెన్స్ సెక్రెటరీ మార్క్ ఈస్పర్ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. పారామిలిటరీ గ్రూప్ లీడర్అబు మహది అల్ ముహందిస్మరో పదిమంది అనుచరులు, వందలాదిగా ప్రజలతో కలిసి ఎంబసీపై దాడి చేశారని ట్రంప్ ఆరోపించారు. హైసెక్యూరిటీ ఉండే చోట ఇలాంటి దాడి జరిగే అవకాశమే లేదని, ఇరాన్ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. మరోవైపు, మిడిల్ ఈస్ట్కు మరో 750 మంది ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్బలగాలను పంపిస్తున్నట్లు ఈస్పర్మీడియాకు వెల్లడించారు. బాగ్దాద్ ఎంబసీపై దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన వివరించారు.
అసలేం జరిగింది?
కాటెబ్ హెజ్బొల్లా పారామిలిటరీ గ్రూపును టార్గెట్ చేసి ఇరాన్, ఇరాక్లలోని పలుప్రాంతాల్లో అమెరికా మిస్సైల్ అటాక్ చేసింది. ఆదివారం జరిగిన ఈ దాడిలో సుమారు 25 మంది చనిపోయారు. దీనిపై ఇరాన్, ఇరాక్లలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై నిరసనకారులు దాడిచేసి, ఆఫీసును ధ్వంసం చేశారు. దీనిపై అమెరికా సీరియస్గా స్పందించింది. వెంటనే తన బలగాలను అక్కడికి పంపించింది.
దాడి టెర్రరిస్టుల పనే..
ఎంబసీపై దాడి టెర్రరిస్టులు చేసిందేనని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ మైక్ పాంపియో ఆరోపించారు. అయితే, ఈ విషయంలో తప్పంతా అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావి ఆరోపించారు. ఇరాన్ భూభాగంపై దాడులు జరిపి అమెరికా, తమ సావరిన్ పవర్కు భంగం కలిగించిందని విమర్శించారు. యూఎస్ దాడిలో తమ పౌరులు కనీసం 25 మంది చనిపోయారని చెప్పారు. ఈ ఘటనతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం అమెరికా ఎంబసీపైకి మళ్లిందని మౌసావి వివరించారు.