రాట్నంతో నూలు వడికిన ట్రంప్

రాట్నంతో నూలు వడికిన ట్రంప్

అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత మధ్య ప్రధాని మోడీతో కలిసి… US నుంచి తెచ్చిన ప్రత్యేక కారు బీస్ట్ వాహనంలో సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు ట్రంప్ దంపతులు. ముందుగా మహాత్మాగాంధీ ఫొటోకు నూలు దండవేసి నివాళులర్పించారు. ఆశ్రమం ప్రత్యేకతలను వారికి తెలియజేశారు మోడీ. ట్రంప్ తో పాటు మెలానియా చరఖాతో నూలు వడికారు.  ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్‌ దంపతులు చూసి ముచ్చటపడ్డారు. తర్వాత అక్కడి విజిటర్ బుక్ లో సంతకాలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి మోతెరా స్టేడియానికి బయలు దేరారు. అక్కడ ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.