ట్రంప్ కల నిజమవ్వాలంటే పక్కన సన్నీలియోన్‌ ఉండాలి

ట్రంప్ కల నిజమవ్వాలంటే పక్కన సన్నీలియోన్‌ ఉండాలి

ఈ నెల 24, 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. అయితే అహ్మదాబాద్‌లో తనకు స్వాగతం పలకడానికి కోటి మంది వస్తారని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. అహ్మదాబాద్ మొత్తం జనాభే అంతమంది లేరు కదా.. మరి అంతమంది ఎలా వస్తారని నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. తనకు స్వాగతం పలకడానికి అంతమంది వస్తారంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉందన్న ట్రంప్ కల నిజమవ్వాలంటే.. ఏకైక మార్గం ఒక్కటే అని ఆర్జీవీ అన్నారు. అందేంటంటే.. ట్రంప్‌ పక్కన కొంతమంది నటీనటులను కూడా ఉంచితే వారిని చూడడానికైనా జనం ఎగబడతారని ఆర్జీవీ అన్నారు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీ కాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, మరియు సన్ని లియోన్ లాంటి వాళ్లను ట్రంప్ పక్కన ఉంచితే.. అలాగైనా ట్రంప్‌కు స్వాగతం పలకడానికి జనం వస్తారని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

For More News..

మీడియాకు షాకిచ్చిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

కులం పేరు రాయలేదని స్కూల్ అడ్మిషన్ క్యాన్సిల్

అయోధ్య రామ మందిరం మోడల్ ఇదే