ఇవాళ (ఆగస్టు 4)నుంచి ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్లు

ఇవాళ (ఆగస్టు 4)నుంచి ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఎంసెట్​ఫైనల్ ​ఫేజ్​ అడ్మిషన్లు శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి. ఈనెల 4న కొత్తవాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 5న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు.  4 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ,  9న  సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. 11 వరకు సెల్ఫ్ రిపోర్టు చేయాలని సూచించారు.   స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ 17 నుంచి 23 వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

 17న రిజిస్ట్రేషన్లు, 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉం టుందన్నారు. 23న సీట్ల అలాట్ మెంట్  చేస్తారు. సీట్లు పొందిన స్టూడెంట్లు 25 వరకు ఆన్​లైన్​లో​ సెల్ఫ్​ రిపోర్టింగ్ చేయాలని, కాలేజీల్లోనూ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఆగస్టు 23న కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లతో పాటు ఇంటర్నల్ స్లైడింగ్​కు సంబంధించి గైడ్ లైన్స్  రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.