టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల

టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ  ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. 
ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం 56962 మంది అభ్యర్థులు పరీక్షలు హాజరు కాగా , వారిలో 51316 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన లోకేష్  మొదటి ర్యాంక్.
హైదరాబాద్ నుండి పమిడి సాయి తనూజ రెండవ ర్యాంక్ .
ల్కాజిగిరి కి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్ 
హైదరాబాద్ నుండి ఆర్ నవీనశాంత, తుమ్మ రాజ శేఖర ద్వారా నాల్గవ ర్యాంక్.
హైదరాబాద్ నుండి చక్రవర్తి గుడ్లవల్లేరు నుండి పోట్లా ఆనంద్ పాల్ ఐదో ర్యాంక్.