పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి: టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగలపల్లి శ్రీనివాస్

పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి: టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగలపల్లి శ్రీనివాస్

డప్పు, చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో వచ్చే నెల 29 న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంను హబ్సిగూడలోని ఓ హోటల్ లో  నిర్వహిం చారు. 

ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి మాదిగలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. ఏ స్వార్థం లేకుండా మాదిగలు మలినాన్ని చేతులతో ఎత్తి పోస్తున్నారని అన్నారు. డప్పుతో పోరాటాన్ని, చెప్పుతో రక్షణ కల్పించిన జాతి మాదిగ జాతి అన్నారు.కాబట్టి మాదిగల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని అన్నారు.