సుప్రీంలో గ్రూప్​1 కేసు వాపస్​కు .. టీఎస్​పీఎస్సీ పిటిషన్

సుప్రీంలో గ్రూప్​1 కేసు వాపస్​కు .. టీఎస్​పీఎస్సీ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​1 పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు టీఎస్​పీఎస్సీ చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విత్​డ్రా పిటిషన్ వేసింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో గ్రూప్​1​ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిని సవాల్​ చేస్తూ నిరుడు అక్టోబర్​ 21న టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎస్​పీఎస్సీ, అప్పటి సర్కారు దాని గురించి పట్టించుకోకపోవడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కేసు లిస్ట్​ కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన గ్రూప్​ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయాలా లేదా పాత నోటిఫికేషన్​ రద్దు చేయాలా అన్న ఆలోచన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.