రాఖీ జోష్ .. ఆర్టీసీకి రికార్డు ఆదాయం

రాఖీ జోష్ .. ఆర్టీసీకి రికార్డు ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రాష్ర్ట వ్యాప్తంగా ఫుల్ రష్ తో నడుస్తున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 9 వేల బస్సులను ఆర్టీసీ నడపగా రూ.18.25 కోట్లు వచ్చాయి.  సాధారణ రోజుల్లో  రూ.15 కోట్లు వస్తుందని అధికారులు చెప్పారు. గురువారం రూ.19 కోట్లు రావొచ్చని  అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రాఖీ సందర్భంగా ఆర్టీసీ చరిత్రలో రికార్డు స్థాయిలో రూ.20.10 కోట్లు రెవెన్యూ రాగా, ఈ ఏడాది ఆ మార్క్ ను దాటుతామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో బస్టాండ్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ ప్రాంతా ల్లో బస్సులు లేక జనం ఇబ్బంది పడ్డారు.