టీఎస్ ​ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్​ అవార్డులు

టీఎస్ ​ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్​ అవార్డులు

హైదరాబాద్, వెలుగు :  నేషనల్‌‌ పబ్లిక్‌‌ బస్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఎక్సలెన్స్‌‌ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ స్టేట్‌‌ రోడ్​ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అండర్‌‌ టేకింగ్స్‌‌(ఏఎస్‌‌ఆర్‌‌టీయూ) అందించే ఐదు ఎక్సలెన్స్‌‌ అవార్డులను టీఎస్‌‌ఆర్టీసీ గెలుచుకుంది. 2022–-23లో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరిల్లో ఈ అవార్డులు దక్కాయి.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్‌‌ జైన్‌‌ చేతుల మీదుగా టీఎస్​ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, అధికారులు అందుకున్నారు. రహదారి భద్రతలో ఫస్ట్, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌‌ విభాగంలో ఫస్ట్, అర్బన్‌‌ విభాగంలో సెకండ్, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ఫస్ట్, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను ఫస్ట్​ ప్రైజ్​లు దక్కాయి.