తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ .. 2024 జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఫీజు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలి.ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ,సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21న ఉదయం 10 గంటలకు.. వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం,గదుల కోటాను అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారని తెలిపింది. వృద్ధులు,దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Also Read :- భారీగా పెరిగిన బంగారం ధర
డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబర్ 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.దర్శన టికెట్ల కోసం భక్తులు http: //ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.