పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి గరుడవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.