ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ను టీవీఎస్ లాంచ్ చేసింది. ధర రూ.2.50 లక్షలు. ఈ స్కూటర్లో 4.44 వాట్ల బ్యాటరీ అమర్చారు. 0 నుంచి 40 కి.మీ స్పీడ్ను 2.6 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది. గరిష్ట స్పీడ్ 105 కి.మీ. ఫాస్ట్ ఛార్జర్తో 50 శాతం ఛార్జింగ్ 50 నిమిషాల్లోనే పూర్తవుతుందని, సాధారణ ఛార్జర్తో అయితే 80 శాతం ఛార్జింగ్ 4.30 గంటల్లో పూర్తవుతుందని వివరించింది.
రిలయన్స్ యూస్టాలో అన్ని డ్రెస్లు రూ. వెయ్యి లోపే
ఫ్యాషన్ స్టోర్ యూస్టాను హైదరాబాద్లోని శరత్ సిటీ మాల్లో రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. యువతపై ఫోకస్ పెట్టిన కంపెనీ ఈ స్టోర్లో అన్ని ప్రొడక్ట్లను రూ.999 కంటే తక్కువకే అమ్ముతోంది. మెజార్టీ ప్రొడక్ట్ రేట్లు రూ.500 కంటే తక్కువ ఉంటాయని రిలయన్స్ రిటైల్ పేర్కొంది.