
- రూ. 4 లక్షల విలువైన 80 మొక్కలు స్వాధీనం
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ అయ్యారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపిన ప్రకారం.. నేరడిగొండ మండలం గోవింద్ పూర్ గ్రామానికి చెందిన రాజు జాదవ్, విజేష్ రాథోడ్ చేనులో గంజా యి సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది.
పోలీసులు వెళ్లి రాజు జాదవ్ పత్తి పంట మధ్యలో 57 గంజాయి మొక్కలు , విజేష్ రాథోడ్ చేనులో 23 గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రూ.4 లక్షలు విలువైన 80 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.