ఆసిఫాబాద్ లో రెండు దారుణ హత్యలు

ఆసిఫాబాద్ లో రెండు దారుణ హత్యలు
  • చంపి పారిపోతుండగా వెంబడించి హత్య చేసిన మృతుడి కొడుకు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రెండు హత్యలు కలకలం రేపాయి. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని బెస్తవాడ కాలనీకి చెందిన బామినే శ్రీను(35), గుబుడే శ్రావణ్ (40) ఎదురెదురు ఇండ్లలో ఉంటున్నారు. కాలనీలో రాత్రి జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ వీరి మధ్య గొడవ జరిగింది.

కోపోద్రిక్తుడైన శ్రీను గొడ్డలితో శ్రావణ్ ను హత్య చేసి పారిపోతుండగా శ్రావణ్ కుమారుడు వెంబడించి అదే గొడ్డలితో శ్రీను తలపై నరికి హత్య చేశాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ రాజు పరిశీలించారు. రెండు శవాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.