గాంధీనగర్ గ్రామంలో చిరుత దాడిలో రెండు దూడలు మృతి 

గాంధీనగర్ గ్రామంలో చిరుత దాడిలో రెండు దూడలు మృతి 

 లింగంపేట, వెలుగు : మండలంలోని గాంధీనగర్​ గ్రామంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో రెండు లేగదూడలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన షేక్​ రజాక్ గ్రామ సమీపంలోని  పశువుల కొట్టంలో ఆవులు, లేగదూడలను కట్టేసి ఉంచగా చిరుతపులి వచ్చి లేగదూడలను చంపిందని సర్పంచ్​ దెగావత్​బాబు తెలిపారు.  దూడల విలువ రూ.50 వేలు ఉంటుందని, పరిహారం అందించాలని బాధితుడు  అటవీశాఖ అధికారులను కోరాడు.

కామారెడ్డి ఎఫ్​డీఓ రామకృష్ణ, ఎల్లారెడ్డి ఇన్​చార్జి  రేంజ్​ ఆఫీసర్ వాసుదేవ్ ​సిబ్బంది తో కలిసి  దూడల మృతదేహాలను  పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. రాత్రి వేళల్లో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని చెప్పారు. చిరుతపులిని గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు చేస్తామని తెలిపారు.