- ఇక ఎంత మంది సంతానం ఉన్నా పోటీకి అర్హులే
- ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదన్న నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ గెజిట్తక్షణమే అమల్లోకి రానున్నది. కాగా, 1994లో ఉమ్మడి ఏపీలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. గడిచిన 30 ఏండ్లలో పరిస్థితులు పూర్తిగా మారాయని ప్రభుత్వం ఆర్డినెన్స్లో పేర్కొన్నది.
ఈ నిర్ణయంతో ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నోళ్లు కూడా సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్పీటీసీలాంటి పదవులకు పోటీ చేసేందుకు అర్హులవుతారు. పోటీచేయాలని ఆసక్తి ఉండి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఆశావహులకు ఈ ఆర్డినెన్స్కొత్త రాజకీయ అవకాశాలను కల్పించనున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
