ఒకరిని కాపాడబోయి ఇద్దరు చనిపోయిన్రు

ఒకరిని కాపాడబోయి ఇద్దరు చనిపోయిన్రు

జవహర్​నగర్, వెలుగు: మహిళను కాపాడబోయి ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడి మృతిచెందారు. ఈ ఘటన జవహర్​నగర్​పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్​స్పెక్టర్​భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..  అరుంధతి నగర్ లో నివసించే సర్జుల్​యాదవ్​కూతురు పుతుల్(10), ​కొడుకు రాహుల్(9), అతడి ఫ్రెండ్​హేమంత్(12) శనివారం ఉదయం కాలనీ వెనక ఉన్న క్వారీ గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా పుతుల్​ పట్టుజారి క్వారీలో పడబోయింది. అక్కడే బట్టలు ఉతుకున్న స్వప్న అనే మహిళ చిన్నారిని  బయటకు లాగి ఆమె లోపలికి పడింది. దాంతో రాహుల్, హేమంత్​ఆమె చేయి పట్టుకుని బయటకు లాగి వారు క్వారీ గుంతలో పడిపోయారు. స్వప్న కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయారు.