బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు : డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో పాటు.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు : డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో పాటు.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

రక్షించాల్సిన పోలీసులు.. అండగా ఉండాల్సిన పోలీసులు.. విచారణ చేసి నిజాన్ని తెలుసుకోవాల్సిన కొంత మంది పోలీసులే.. కిలాడీల అవతారం ఎత్తారు. బంగారం వ్యాపారి లావాదేవీలను తమకు అనుకూలంగా మార్చుకుని.. ఏకంగా తమ బ్యాంక్ అకౌంట్లలోనే లంచం డబ్బులు వేయించుకున్నారు. హైదరాబాద్ సిటీలోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీస్ శాఖనే కుదిపేసింది. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం ఉన్నతాధికారుల వరకు వెళ్లటం.. విచారణ చేయటం.. ఆ తర్వాత చర్యలు తీసుకోవటం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హవాలా మానీ పట్టుకోవడంతో పాటు వదిలిపేట్టడం కోసం ఆరు లక్షల రుపాయలను ఎకౌంట్ లో జమ చెసుకున్న డిఐ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను నగర సీపీ సివి ఆనంద్ సస్పెండ్ చేశారు..

హైదరాబాద్ మహాంకాళి పోలీస్టేషన్ పరిధిలో ఓ బంగారం వ్యాపారి వ్యాపర నిమిత్తం లక్షల రుపాయలతో ఉన్న బ్యాగు తీసుకుని వెళుతుండగా శ్యామ్, మహేశ్‌ అనే కానిస్టేబుళ్ళు పట్టుకున్నారు. హవాల డబ్బు అంటూ అనుమానించి ఆ వ్యాపారిని బెదిరించారు.  వ్యాపారి హవాలా డబ్బును క్యారీ చేస్తున్నాడని  డీఐ కేసరి ప్రసాద్ కు సమాచారం ఇచ్చారు.  

అది హవాలా డబ్బు అని.. కేసులు పెడతామని బెదిరించారు. కేసు లేకుండా, డబ్బులు చేతికి రావాలంటే.. ఆరు లక్షల రుపాయలు ఇవ్వాలని డీల్ కుదుర్చున్నారు. అంతేకాదు..  ఒప్పందం చేసుకున్న ప్రకారం రావాల్సిన డబ్బును నేరుగా బ్యాంక్ ఎకౌంట్ లో వేయించుకున్నారు. 

పోలీసులు బెదిరించి డబ్బును కాజేసిన విషయాన్ని బంగారం వ్యాపరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన సీపీ డీఐ కేసరి ప్రసాద్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.