- నాగ్పూర్ హాస్పిటల్లో సాలని బెడ్లు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
నాగ్పూర్: కరోనా సోకిందంటే.. ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచుతరు. అతని దగ్గరికి ఎవర్నీ పోనియ్యరు. డాక్టర్లు కూడా పీపీఈ కిట్లు వేసుకొని ట్రీట్ మెంట్ ఇస్తరు. బాధితుడి నుంచి వైరస్ మరెవరికీ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటరు. కానీ నాగ్ పూర్ లోని ఓ ఆస్పత్రిలో మాత్రం ఇద్దరు కరోనా పేషెంట్లను ఒకే బెడ్ పై ఉంచిన్రు. హాస్పిటల్ కు వైరస్ బాధితుల తాకిడి పెరగడంతో అక్కడ బెడ్లు సాలక ఇట్ల చేసిన్రట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయట కు రావడంతో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న పరిస్థితికి ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి. ‘‘ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. బెడ్లను పెంచి, ఒక్క బెడ్ను ఒక్క పేషెంట్కే ఇచ్చినం. మాపై వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉంది” అని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే చెప్పారు. ప్రైవేట్లో ఖర్చు ఎక్కువవుతుందని బాధితులు గవర్నమెంట్ హాస్పిటళ్లకే వస్తున్నారని, సీరియస్ కేసులను డాక్టర్లు ఇక్కడికే రిఫర్ చేస్తున్నారని.. దీంతో సర్కార్ దవాఖాన్లకు పేషెంట్ల తాకిడి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ‘నాగ్పూర్లో బెడ్లు సాల్తలేవ్. ఒకే బెడ్పై ఇద్దరు కరోనా పేషెంట్లను ఉంచితే, వాళ్లకు వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ కుంభకర్ణుడిలా నిద్రపోతోంది. నాగ్పూర్ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, ఒక్కరూ సిటీ లో లేరు. వాళ్లు వేరే ఎక్కడో బిజీగా ఉన్నారు’ అని బీజేపీ లీడర్ చంద్రకాంత్ మండిపడ్డారు.
ఉరేసుకున్న కరోనా పేషెంట్..
కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగ్పూర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీ)లో సోమవారం జరిగిం ది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన 81 ఏండ్ల పెద్దాయన ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్నాడని జీఎంసీ ఇన్ చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాంచన్ వాంఖడే చెప్పారు.