సైబర్ ఇన్స్పెక్టర్లూ.. మోసపోయారు!.. టీటీడీ దర్శనం పేరుతో రూ. 4 లక్షలు సమర్పయామి

సైబర్ ఇన్స్పెక్టర్లూ.. మోసపోయారు!.. టీటీడీ దర్శనం పేరుతో రూ. 4 లక్షలు సమర్పయామి
  • స్టాక్​ మార్కెట్​లో లాభాలొస్తాయని  
  • రూ.39 లక్షలు ఇచ్చిన మరొకరు  

ఎల్బీనగర్, వెలుగు: సైబర్ నేరగాళ్లను పట్టుకునే సైబర్​క్రైమ్స్ లో పని చేసే ఇద్దరు ఇన్​స్పెక్టర్లు చివరకు వారి చేతిలో మోసపోయారు. సైబర్​క్రిమినల్స్​ నేరాల పట్ల అవగాహన ఉన్న వారే రూ.లక్షలు పోగొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 టీటీడీ దర్శనం పేరుతో ఓ ఇన్​స్పెక్టర్ ఈ రూ.4 లక్షలు పోగొట్టుకోగా, ​స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మిన మరొకరు ఏకంగా రూ.39లక్షలు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరూ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయమై రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ, ఏసీపీ వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.