ఎన్​కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎన్​కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
  • ఛత్తీస్​గఢ్‌‌‌‌లోని బడేదేపర అడవుల్లో ఘటన 

భద్రాచలం, వెలుగు :  బీజాపూర్​ జిల్లా మద్దేడు పీఎస్‌‌‌‌​ పరిధిలో బడేదేపర అడవుల్లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్​కథనం ప్రకారం.. మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో డీఆర్​జీ, సీఆర్​పీఎఫ్​ బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు హోరాహోరీగా జరిగాయి. కాల్పులు ఆగిపోయాక చూడగా సంఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. రూ.8 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు లీడర్​మనీలాతో పాటు పురుష మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

10 మంది లొంగుబాటు

దంతెవాడ ఎస్పీ గౌరవ్​రాయ్ ​ఎదుట బుధవారం 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన వీరు గతంలో అనేక విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారు. లచ్చూ పొడియం, రాజేశ్​, మంకూ పొడియం, రాంబతి, సుశీల్​పొడియం, బామన్​మడకం, రానూ కొవ్వాసి, జోగా మడవి, మంగోలీ లొంగిపోయిన వారిలో ఉన్నారు.  

మలాంగీర్​ ఏరియా కమిటీ కమాండర్​ అరెస్ట్ 

మలాంగీర్​ ఏరియా కమిటీ కమాండర్ ​బార్సే మూయీని సుక్మా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెపై రూ.5లక్షల రివార్డు ఉందని, డాక్టర్స్ టీంకు నాయకత్వం వహిస్తున్నారని ఎస్పీ కిరణ్ ​చౌహాన్ తెలిపారు. మందుపాతర, విప్లవ సాహిత్యం, తుపాకీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.