దోహా: ఆసియా అథ్లెటిక్స్ లో తొలి రోజే ఇండియాకు రెండు పతకాలు వచ్చాయి. ఆదివారం జరిగిన జావెలిన్ త్రోలో 60.22 మీటర్లతో అను రాణి రజతం నెగ్గింది. 5000 మీ. రన్ను 15 నిమిషాల 36.03 సెకండ్లలో ముగించి మూడో స్థానంలో నిలిచిన పరుల్ చౌదరి కాంస్యం గెలిచింది. కాగా, ద్యుతీచంద్ 100మీ. రేస్ సెమీస్ కు చేరుకుం ది. నాలుగో హీట్ లోద్యుతీ 11.28 సెకండ్లతో తన పేరి టే ఉన్న నేషనల్ రికార్డును బద్దలు కొడుతూ టాప్ ప్లేస్ సాధించింది. .అయితే, మరో యువ అథ్లెట్ హిమాదాస్ వెన్ను నొప్పికారణంగా 400 మీటర్ల రేస్ హీట్ ను పూర్తి చేయలేకపోయిం ది. 800 మీటర్ల ఈవెంట్ లో జిన్సన్ జాన్సన్ ,400 మీ. రేస్ లో మహ్మద్ అనాస్ , అరోకి యా రాజీవ్సెమీస్ కు అర్హత సాధించారు. ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రావల్ , మహిళల 1500 మీ. రేస్ లో గోమతిమరిముత్తు ఫైనల్ చేరారు.