
అమాయకుల్ని మోసగిస్తూ.. తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదిద్దామనే దుర్భుద్ది గల ఇద్దరు నేరగాళ్లను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసు బృందం అరెస్ట్ చేసింది. వారు చేస్తున్న మోసాన్ని అడ్డుకొని ఆ ఇద్దర్ని కటకటాల వెనక్కి సాగనంపింది.
హైద్రబాద్ పాతబస్తి బహదూర్ పురా ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ ముష్తాఖ్, హఫీజ్ బాబానగర్ కి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడే వారు.
తాను పని చేస్తున్న చోట బొమ్మ జంతువులను అమ్ముకుంటున్న వ్యక్తిని గమనించిన ముష్తాఖ్.. ఓ దురాలోచన చేసి అమాయక జనాన్ని మోసం చేసి డబ్బు గుంజుదామనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఓ మేక చర్మానికి రంగు పూసి, దానిపై చారలు పెట్టి పులి చర్మముగా నమ్మబలికి అమ్ముదామనుకున్నాడు . అచ్చము పులి తోలులాగా కనిపించే ఆ మేక చర్మానికి నకిలి దంతాలు, గోర్లు అమర్చి ఖదీర్ తో కలిసి అమ్మేందుకు మిధాని బస్ డిపొ వద్దకు చేరుకున్నారు. వారి దగ్గరున్న ఆ చర్మాన్ని గమనించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు అనుమానంతో ఇద్దర్నీ అదుపులొకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి నకిలీ పులి చర్మము, నకిలీ పులి గోర్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కంచన్ బాగ్ పొలీసులకు అప్పగించారు.