యాక్సియం–4 మిషన్ లాంచ్.. అంతరిక్షంలోకి దూసుకెళ్తోన్న శుభాంశు శుక్లా

యాక్సియం–4 మిషన్ లాంచ్.. అంతరిక్షంలోకి దూసుకెళ్తోన్న శుభాంశు శుక్లా

న్యూఢిల్లీ: భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఎట్టకేలకు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. ఇప్పటి వరకు 7 సార్లు శుభాంశు శుక్లా పయాణం వాయిదా పడగా.. 8వ సారి విజయవంతంగా అంతరిక్షంలో వెళ్లారు. యాక్సియం–4 మిషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. ఈ మిషన్‌‌‌‌‌‌‌‌కు ఆయన పైలెట్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. యాక్సియం–4 మిషన్ ప్రయోగం బుధవారం (జూన్ 25) మధ్యాహ్నం 12:01 (ఇండియన్ టైమ్) జరిగింది. 

దీన్ని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. కౌంట్ డౌన్ అనంతరం ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది గురువారం (జూన్ 26) సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్‌‌‌‌‌‌‌‌తో డాకింగ్ అవుతుందని నాసా పేర్కొంది. కాగా, ఈ మిషన్‌‌‌‌‌‌‌‌ ప్రయోగం 2025, మే 29నే జరగాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు 2025, జూన్ 25న అంతరిక్షానికి బయలుదేరారు. 14 రోజుల పాటు ఈ నలుగురు ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో ఉండనున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయితే రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా చరిత్రకెక్కనున్నారు.